రండి.. వ్యాక్సిన్ కోసం గళమెత్తుదాం

రండి.. వ్యాక్సిన్ కోసం గళమెత్తుదాం

న్యూఢిల్లీ: దేశానికి కరోనా వ్యాక్సిన్ అవసరం చాలా ఉందనిర్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి భారతీయుడు సురక్షితంగా ఉండాలన్నదే ధ్యేయంగా పెట్టుకోవాలని కేంద్రానికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో "స్పీకప్ ఫర్ వ్యాక్సిన్ ఫర్ ఆల్" అనే క్యాంపెయిన్ ను ప్రారంభం సందర్భంగా రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. వైరస్ నుంచి దేశ వాసులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరికీ టీకాను అందించాలని డిమాండ్ చేశారు. 'దేశానికి కరోనా టీకా ఆవశ్యకత చాలా ఉంది. అందుకోసం. అందరమూ గళమెత్తాలి. అందరూ సురక్షితంగా ఉండాలి' అని రాహుల్ పేర్కొన్నారు.