దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనంలో అధికారులు కొవిడ్ వ్యాక్సిన్లను తరలించగా తీవ్ర విమర్శలు వచ్చాయి. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని ఓ కేంద్రానికి వ్యాక్సిన్లను చెత్త వాహనంలో తీసుకెళ్లి దించారు. దీంతో ప్రజారోగ్యంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని స్థానికులు మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు.