చిరుత దాడిలో ఆవు మృతి

చిరుత దాడిలో ఆవు మృతి

చిత్తూరు జిల్లా : చిరుత దాడిలో పశువు చనిపోయిన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం, బాపలనత్తం గ్రామానికి చెందిన రైతు కె. రామయ్య పశువులపై ఈ ఉదయం చిరుత దాడి చేసింది.

గ్రామ సమీపంలో గల వ్యవసాయ పొలంవద్ద చిరుతపులి చేసిన ఈ దాడిలో ఆవు చనిపోగా ఒక దూడకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు రైతు. చిరుత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలుసార్లు గ్రామ శివార్లకు రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్థులు.