మాస్క్ లేకపోతే కేసు ఫైల్ చేస్తం

మాస్క్ లేకపోతే కేసు ఫైల్ చేస్తం
  • సిటీ సీపీ అంజనీకుమార్  

హైదరాబాద్‌,వెలుగు: మాస్క్‌ లేకుండా తిరిగే వారిపై కేసు ఫైల్ చేస్తామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. కొవిడ్‌ రూల్స్‌ కింద ఫైన్ విధిస్తామని చెప్పారు. బుధవారం బషీర్‌‌బాగ్‌ చౌరస్తాలో మాస్క్‌ అవేర్ నెస్ ప్రోగ్రామ్ నిర్వహించగా.. జాయింట్‌ సీపీలు అనిల్‌కుమార్,శిఖాగోయల్‌,తరుణ్‌ జోషి, విశ్వప్రసాద్‌తో కలిసి అంజనీకుమార్ ప్లకార్డులను ప్రదర్శించారు. ‘యూజ్ మాస్క్‌ ప్రొటెక్ట్‌ యువర్‌‌ ఫ్యామిలీ’ పేరుతో జనాలకు అవగాహన కలిగించారు. సిటీలోని అన్ని జంక్షన్లలో మాస్క్‌ అవేర్ నెస్‌ ప్రోగ్రామ్స్ కండక్ట్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు.  మాస్క్ పెట్టుకోని వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు కేసులు రిజిస్టర్ చేస్తున్నట్టు చెప్పారు.