
సిద్దిపేట రూరల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆదివారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ తనిఖీలలో 47 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 65 పెట్టి కేసులు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై 375 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, సైదా, లతీఫ్, శ్రీను, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మురళి పాల్గొన్నారు