పోలీసు శాఖకు వన్నె తేవాలి : అవినాశ్​  మహంతి 

పోలీసు శాఖకు వన్నె తేవాలి : అవినాశ్​  మహంతి 

గచ్చిబౌలి, వెలుగు :  సివిల్​ స్టైఫండరీ క్యాడెట్​ ట్రైనీ పోలీస్​ కానిస్టేబుల్స్​ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి సూచించారు.   బుధవారం గచ్చిబౌలి సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​పరేడ్​గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్ ​ప్రొగ్రాంకు  సైబరాబాద్​ సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ..   తెలంగాణ రాష్ర్ట పోలీసులకు బెస్ట్​ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దేశంలో మంచి పేరుందన్నారు.

 ప్రస్తుతం ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్టైఫండరీ క్యాడెట్​ట్రైనీ పోలీస్​ కానిస్టేబుల్స్​ రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.  నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. ట్రైనింగ్​ సమయంలో ఇండోర్​, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ట్రాఫిక్​ జాయింట్​ సీపీ జోయెల్​ డేవిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీటీసీ డీసీపీ ప్రిన్సిపల్​ ఎల్​సీ నాయక్​, ఇతర అధికారులు పాల్గొన్నారు.