- సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : జనాలకు భద్రతలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గవర్నర్, సీఎం,మంత్రులు సహా వీఐపీల సెక్యూరిటీ పటిష్టంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ను శనివారం ఆయన సందర్శించారు.
జాయింట్ సీపీ సత్యనారాయణతో కలిసి అన్ని విభాగాల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కొత్త టెక్నాలజీ నైపుణ్యం, శారీరక సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పోలీస్ బలగాలు సెరిమొనియల్ పరేడ్ నిర్వహించాయి.