
టెన్త్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ సీపీ రంగనాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.
నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.
బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మరిన్ని కామెంట్స్
సోమవారం సాయంత్రం ప్రశాంత్ బండి సంజయ్ మధ్య వాట్సాప్ చాట్
ప్రశాంత్ బండి సంజయ్ తో వాట్సాప్ కాల్ మాట్లాడారు
మేం పక్కాగా లీగల్ ల ప్రొసీజర్ ఫాలో అయ్యాం
ఆ పార్టీ, ఈ పార్టీ అని మాకు తేడా లేదు
ఎగ్జామ్ రద్దు చేయాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోంది
పేపర్ ప్లాన్ ప్రకారం చేశారు
చాట్ లో ఏముందో పేపర్లో అదే వచ్చింది
భయపడి చాలా డేటాను డిలీట్ చేశారు
బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాస్తున్నారు
అధారాలు బయటకు వస్తాయనే ఫోన్ ఇవ్వడం లేదు
విచారణకు టైమ్ పడుతుంది ః
నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం