
- బేరసారాలు మెదలు పెడ్తారా?
- సౌత్ లోనే కాంగ్రెస్ ఉండదంటే అర్థం ఏంటి?
- గత పదేళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు ఎన్నో జరిగాయి
- అమ్ముడు పోయిన ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు
- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్: సౌత్ ఇండియాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కొందరు సభ్యులు కామెంట్ చేస్తున్నారని, దానర్థం బేరసారాలు మొదలు పెడ్తారనా..? అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొడతారా? అని ప్రశ్నించారు.
గత పదేళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని చెప్పారు. అలా అమ్ముడు పోయిన వారిలో ఒక్కరూ కూడా గెలవలేదని, అసెంబ్లీ మెట్లు ఎక్కలేదని కూనంనేని గుర్తు చేశారు.