రైతులను అణచివేస్తున్న మోదీ ప్రభుత్వం: సీపీఐ నారాయణ

రైతులను అణచివేస్తున్న మోదీ ప్రభుత్వం: సీపీఐ నారాయణ


హైదరాబాద్, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న రైతులను మోదీ ప్రభుత్వం క్రూరంగా అణచివేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం సీపీఐ  భారీ ప్రదర్శన నిర్వహించింది.