ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి : రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి : రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
  •     సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఫుడ్​ పాయిజనింగ్​ఘటనలు పునరావృతమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు విచారణ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ డిమాండ్ చేశారు. గురుకుల హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. హైదరాబాద్​బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం కలుషిత పెరుగు, కుళ్లిన కూరగాయల ఆహారం తిని 26 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠి, నిలోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఈ మేరకు ఆదివారం కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్లీ పరామర్శించి మాట్లాడారు. ఈ ఘటన బయటకు రాకుండా ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయత్నించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఉప్మారవ్వ, పులిసిన పెరుగు, కుళ్లిన కూరగాయల వల్లనే  ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నాయని చెప్పారు.