ఐఆర్జీసీ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ పేల్చేశాం.. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడి

ఐఆర్జీసీ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ పేల్చేశాం.. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడి

వాషింగ్టన్: టెహ్రాన్‌‌‌‌లో ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్స్​ కోర్( ఐఆర్​జీసీ)​​ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ను అమెరికా సైన్యం మిసైల్స్​ దాడులతో పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిని ‘పాము తలను కట్​చేయడం’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌‌‌‌కామ్) పేర్కొంది. ఇప్పుడు ఐఆర్​జీసీకి హెడ్‌‌‌‌క్వార్టర్స్ లేదని, ఈ దాడిలోనే ఐఆర్​జీసీ కమాండర్ మహమ్మద్ పక్‌‌‌‌పూర్ మరణించాడని ప్రకటించింది. గత 47 ఏండ్లలో ఐఆర్​జీసీ వెయ్యి మందికిపైగా అమెరికన్ల ప్రాణాలు బలిగొన్నదని ఆరోపించింది. 

అమెరికా–ఇజ్రాయెల్ కలిసి శనివారం నుంచి చేస్తున్న ఈ దాడుల్లో ఇరాన్​లోని వెయ్యికి పైగా టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో ఐఆర్​జీసీ జాయింట్ హెడ్‌‌‌‌క్వార్టర్స్, కమాండ్ సెంటర్లు, ఐఆర్​జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ హెడ్‌‌‌‌క్వార్టర్స్, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు, నౌకలు, సబ్‌‌‌‌మెరైన్లు ఉన్నాయి. అమెరికా ఫ్రిగేట్ల నుంచి క్షిపణులు ప్రయోగించి ఐఆర్​జీసీ భవనాలు, ఇరాన్ యుద్ధ విమానాలను పేల్చివేశారు. తొమ్మిది ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని అమెరికా ప్రెసిడెంట్​డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.