హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన కనీస వేతన జీవో 60ని సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ కమిషనర్కు శనివారం ఆయన లేఖ రాశారు. షాహి ఎక్స్పోర్ట్ మహిళా కార్మికులకు కనీసం రూ.16 వేలు అందేలా చూడాలని కోరారు.
హైదరాబాద్లోని నాచారం పారిశ్రామిక వాడలోని షాహిఎక్స్పోర్ట్ పరిశ్రమలో దాదాపు 2 వేల మందికి పైగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. 20 ఏండ్లుగా ఈ పరిశ్రమ నడుస్తున్నప్పటికీ, కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు.
వీరికి రూ.26 వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా.. నెలకు రూ.11,230 మాత్రమే గ్రాస్ జీతం ఇస్తున్నారని, ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కనీసం రూ.16 వేలు ఇవ్వాలని కోరుతూ 6 రోజులుగా కంపెనీ గేటు ముందే తీవ్రమైన చలిలో కూడా మహిళా కార్మికులు సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. తక్షణమే ఆ కార్మికులకు కనీసం రూ.16 వేల వేతనం అమలయ్యేలా చూడాలని కోరారు.
