క్రేజీ కాంబోలో అఖిల్, చైతు..?

క్రేజీ కాంబోలో అఖిల్, చైతు..?

‘ఆర్‌‌‌‌ఎక్స్‌‌ 100’ తర్వాత ఇంతవరకూ మరో సినిమా చేయని అజయ్‌‌ భూపతి ఇటీవలే తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్‌‌ చేశాడు. భవ్య క్రియేషన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై రూపొందే ఈ సినిమాలో నటీనటులు ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్‌‌ హీరోలంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘మహాసముద్రం’ పేరుతో అజయ్ భూపతి ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విషయంలో రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్​తో పాటు చాలామంది పేర్లు వినిపించాయి. అయితే వాళ్లెవరూ కన్‌‌ఫర్మ్ కాలేదని, నాగచైతన్య ఫిక్సయ్యాడని అంటున్నారు.

మల్టీస్టారర్ కనుక మరో హీరోగా ఎవరిని తీసుకుందామా అని ఆలోచిస్తున్న అజయ్‌‌ భూపతి.. అఖిల్‌‌ వైపు మొగ్గు చూపాడట. అఖిల్ కూడా ఓకే అనడంతో ఈ క్రేజీ కాంబోని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. నేనేం సినిమా తీస్తానో, ఎవరితో తీస్తానో నేను చెప్తాను, అంతవరకూ వెయిట్ చేయండి కానీ ఏది పడితే అది రాసేయకండి అంటూ గతంలో ఓసారి క్లాస్ పీకాడు అజయ్‌‌ భూపతి. కాబట్టి తొందరపడి ఈ విషయానికి ఫిక్స్‌‌ అయిపోకుండా అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్ వచ్చేవరకూ వెయిట్ చేయడం మంచిది.