
- రాణించిన బ్రూక్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్
- ప్రసిధ్కు 3, సిరాజ్కు 2 వికెట్లు
- ఇండియా రెండో ఇన్నింగ్స్లో 90/2
- 96 రన్స్ లీడ్లో టీమిండియా
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/83) తడాఖా చూపెట్టాడు. ఇంగ్లిష్ బ్యాటర్లు మెరుగ్గా రాణించినా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటకుండా చూశాడు. ఒలీ పోప్ (137 బాల్స్లో 14 ఫోర్లతో 106) సెంచరీకి తోడు హ్యారీ బ్రూక్ (99), జెమీ స్మిత్ (40) రాణించడంతో.. 209/3 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 100.4 ఓవర్లలో 465 రన్స్కు ఆలౌటైంది. ఫలితంగా ఇండియాకు ఆరు రన్స్ స్వల్ప ఆధిక్యం లభించింది.
బుమ్రాకు తోడుగా ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 90/2 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (47 బ్యాటింగ్), శుభ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం ఇండియా 96 రన్స్ లీడ్లో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) నాలుగో ఓవర్లోనే ఔటయ్యాడు. రాహుల్, సాయి సుదర్శన్ (30) నెమ్మదిగా ఆడుతూ క్రమంగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్లో, డే చివర్లో స్టోక్స్ (1/18).. సుదర్శన్ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఫలితంగా రెండో వికెట్కు 66 రన్స్ భాగస్వామ్యం ముగిసింది.
బ్రూక్ సూపర్..
ఓవర్నైట్ సెంచరీ బ్యాటర్ పోప్ మూడో రోజు తొందరగా ఔటైనా.. బ్రూక్ అద్భుతంగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. బుమ్రా కచ్చితత్వాన్ని మిగతా బౌలర్లు అందుకోలేకపోవడం కూడా ఇండియాకు మైనస్గా మారింది. దీంతో స్వేచ్ఛగా షాట్లు ఆడిన ఇంగ్లిష్ లోయర్ ఆర్డర్ మంచి స్కోరును అందించింది. డే మూడో ఓవర్లో ప్రసిధ్ బౌలింగ్లో పోప్ ఔట్ కావడంతో నాలుగో వికెట్కు 19 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. పేస్–స్పిన్ను సమర్థంగా ఎదుర్కొన్న బ్రూక్ 65 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఈ క్రమంలో ఓసారి క్యాచ్ ఔట్ నుంచి కూడా బయటపడ్డాడు. అయితే అవతలి వైపు స్టోక్స్ (20) 12 ఓవర్లు క్రీజులో ఉన్నా ఎక్కువ రన్స్ చేయలేదు. చివరకు 65వ ఓవర్లో సిరాజ్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్కు పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్కు 51 రన్స్ జతయ్యాయి. 28 ఓవర్లలో 118 రన్స్ జోడించిన ఇంగ్లండ్ 327/5తో లంచ్కు వెళ్లింది. లంచ్ తర్వాత జెమీ స్మిత్, బ్రూక్కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ మళ్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అయితే ఇండియా ఫీల్డింగ్ తప్పిదాలు కూడా వీళ్లకు కలిసొచ్చాయి. ఆరో వికెట్కు 73 రన్స్ జోడించి స్మిత్ వెనుదిరిగాడు. ఈ టైమ్లో వచ్చిన క్రిస్ వోక్స్ (38) అటాకింగ్ గేమ్ ఆడాడు. 82 రన్స్ వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ వదిలేశాడు. చివరకు 99 రన్స్ వద్ద ప్రసిధ్ వేసిన స్ట్రయిట్ బాల్ను షాట్ కొట్టే ప్రయత్నంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో శార్దూల్కు చిక్కాడు.
ఫలితంగా సెంచరీ మిస్ కావడంతో పాటు ఏడో వికెట్కు 49 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఈ టైమ్లో వోక్స్కు బ్రైడన్ కార్సీ (22) అండగా నిలిచాడు. బుమ్రా మినహా మిగతా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో ఎనిమిదో వికెట్కు 55 రన్స్ జతయ్యాయి.
కానీ మూడు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. చివర్లో జోష్ టంగ్ (11)ను పెవిలియన్కు పంపిన బుమ్రా ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కాపాడాడు. 23.4 ఓవర్లలో 138 రన్స్ జత చేసిన ఇంగ్లండ్ చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (పోప్ 106, బ్రూక్ 99, బుమ్రా 5/83, ప్రసిధ్ కృష్ణ 3/128, సిరాజ్ 2/122). ఇండియా రెండో ఇన్నింగ్స్: 23.5 ఓవర్లలో 90/2 (రాహుల్ 40*, సాయి సుదర్శన్ 30, స్టోక్స్ 1/18).