కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాక కుమారుడు, బీజేపీ కొర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలహర్ మండలం ఆన్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను బీజేపీ జెండా ఎగురవేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు,  క్రీడాకారులు వివేక్ కు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘కాకా పౌండేషన్ ద్వారా క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ పోటీల ద్వారా మారుమూల ప్రాంతాల వారికీ మంచి అవకాశం లభిస్తోంది. క్రికెట్ అంటే ఇష్ట పడే వారు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని వివేక్ అన్నారు. ఈ క్రికెట్ టోర్నీ నిర్వాహకులకు వివేక్ ధన్యవాదాలు తెలిపారు.

For More News..

ఇండస్ట్రీలో ఆ స్థానం నాకు వద్దు

సాయిధరమ్ తేజ్ ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి