సాయిధరమ్ తేజ్ ను కలిసిన కిషన్ రెడ్డి

సాయిధరమ్ తేజ్ ను కలిసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: హీరో సాయిధరమ్ తేజ్ ఇంటికి ఎంపీ కిషన్ రెడ్డి వెళ్లారు. తేజ్ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అప్పటినుంచి ఆయన ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేజ్ ను ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బిజీ షెడ్యూల్ లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించిన కిషన్ రెడ్డికి సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు.