శ్రీశైలంలో భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం

శ్రీశైలంలో భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో ఆలయ క్షేత్రంలో భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. 
స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మరోపక్క వరుస సెలవులు కావడంతో స్వామి వారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.  రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.