తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం) 78,726 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.