తమిళ స్వామి కోసం పోటెత్తిన జనం

తమిళ స్వామి కోసం పోటెత్తిన జనం
  • స్వామిని స్టేషన్ కు తరలించిన పోలీసులు

కేటిదొడ్డి, వెలుగు: తమిళనాడుకు చెందిన స్వామి కోసం జనాలు పోటెత్తడంతో మండలంలోని కొండాపురం స్టేజి దగ్గర జాతర వాతావరణం నెలకొంది. తమిళనాడుకు చెందిన స్వామి తిరుపతి కేంద్రంగా పని చేస్తున్నాడు. తనను దేవుడు ఇక్కడ సేవ చేయాలని చెప్పడంతో వచ్చానని, 20 రోజుల కింద ఇక్కడి ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లాడు. వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి మాటలు రాని వారికి మాటలు తెప్పిస్తానని, చెవులు వినపడని వారికి వినికిడిని తెప్పిస్తానని, పక్షవాతంతో బాధ పడేవారిని బాగు చేస్తానని, అంతా దేవుడి వల్లనే జరుగుతుందంటూ ప్రచారం చేసుకున్నాడు.

ఆదివారం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉమిత్యాల సర్పంచ్  సత్యనారాయణ పొలంలో ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విషయం పోలీసులకు తెలియడంతో స్వామిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పర్మిషన్  ఉంటేనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే కేసులు పెడతామని హెచ్చరించడంతో సర్పంచ్  ఇంటికి చేరుకున్నాడు. పర్మిషన్ వచ్చాకే ఆశ్రమం ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని స్వామి చెప్పారు.