రోడ్డు ప్రమాదంలో CRPF హెడ్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో CRPF హెడ్ కానిస్టేబుల్ మృతి

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పుర చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో CRPF హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో నల్లకుంట నుండి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి వస్తున్న డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాం వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. వాహనాన్ని నడుపుతున్న మరో కానిస్టేబుల్ దామోదర్ కు గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.  కేసు నమోదు చేసి డిసిఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.