క‌రోనా వైర‌స్ కు మ‌రో CRPF జ‌వాన్ బ‌లి.. ఇప్ప‌టివ‌ర‌కు 8 మంది మృతి

క‌రోనా వైర‌స్ కు మ‌రో CRPF జ‌వాన్ బ‌లి..  ఇప్ప‌టివ‌ర‌కు 8 మంది మృతి

ఢిల్లీ : క‌రోనా వైర‌స్ బారిన ప‌డి శ‌నివారం ఓ సీఆర్పీఎఫ్ జ‌వాన్ మృతి చెందాడు. న‌గ‌రంలోని సీఆర్‌పిఎఫ్ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కానిస్టేబుల్ ర్యాంక్ అధికారి(43).. గ‌త కొంత‌కాలంగా మూత్రపిండాల సమస్య మరియు రక్తపోటుతో బాధపడుతున్నారని అధికారులు ‌తెలిపారు. టీవ‌లె ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌కు శుక్రవారం కోవిడ్ -19 టెస్ట్ చేయ‌గా పాజిటివ్ అని తేలిందని, ప‌రిస్థితి విష‌మించడంతో శనివారం ఉద‌యం చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడ‌ని చెప్పారు. మృతి చెంద‌ని బీహార్‌కు చెందినవాడ‌ని తెలిపారు.

కాగా, శనివారం మృతిచెందిన జవాన్‌తో కలిపి సీఆర్‌పీఎఫ్‌లో మొత్తం మరణాల సంఖ్య 8కి చేరింది. అదేవిధంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా 1,046కు చేరుకుంది. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఈ వివరాలను వెల్లడించారు.