ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు జవాన్లకు గాయాలు

సార్వత్రిక ఎన్నికల ముందు ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు అలజడి స్పష్టిస్తున్నారు. దంతారి జిల్లాలోని సలేఘాట్ లో ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు CRPF జవాన్లు గాయపడ్డారు. మావోయిస్టులకు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇక నిన్న కాంక్లేర్ జిల్లా మహ్లా గ్రామ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతదేహాలకు  సీఎం బూపేష్ బాఘల్, హోంశాఖ మంత్రి సాహు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక వరుస ఘటనలతో దంతేవాడ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.