హైదరాబాద్ కు ఈసీ.. రెండు నెలల్లోనే ఎన్నికలకు చాన్స్

హైదరాబాద్ కు ఈసీ.. రెండు నెలల్లోనే ఎన్నికలకు చాన్స్

కేంద్ర ఎన్నికల అధికారుల బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుందని.. కావాల్సిన సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పలు శాఖల అధికారులతో ఆమె సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వచ్చే నెల మూడో తేది నుంచి కేంద్ర బృందం హైదరాబాద్ లో పర్యటిస్తుందని.. ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు,సీపీలతో పాటుసీనియర్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. 

ALSO READ: త్వరలోనే కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తారు: హరీశ్ రావు

రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున  అధికారులు సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.