ఇద్దరు ఐఏఎస్లకు పదోన్నతి

ఇద్దరు ఐఏఎస్లకు పదోన్నతి

రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. ప్రమోషన్ పొందిన ఐఏఎస్ లలో సందీప్ కుమార్ సుల్తానియా, అనితా రాజేంద్ర ఉన్నారు. వీరిద్దరు 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారులే. వీరి పదోన్నతులు, పోస్టింగ్ కు సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సెక్రెటరీ (పీఆర్ అండ్ ఆర్డీ విభాగం) హోదాలో ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాను అదే పోస్టులో కొనసాగించనున్నారు. అయితే ఆయన హోదాను ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయికి పెంచారు. ఇక అనితా రాజేంద్ర ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ జనరల్ (డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్ స్టిట్యూట్) హోదాలో ఉన్నారు.  అనితా రాజేంద్రను  అదే పోస్టులో కొనసాగిస్తూ హోదాను అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయికి పెంచారు.