తండాలోని ఇండ్లకు కరెంట్ షాక్

తండాలోని ఇండ్లకు కరెంట్ షాక్
  • సబ్​స్టేషన్​ ఎదుట బాధితుల ఆందోళన

కామారెడ్డి​, వెలుగు : రాజంపేట మండలం పలుగడ్డ తండాలోని ఇళ్ల గోడలకు గురువారం రాత్రి కరెంట్ షాక్ రావడంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి గోడలు, వస్తువులకు టెస్టర్ పెట్టి చూడగా కరెంట్ సప్లై చూపించింది. ఫీడర్​ఆఫ్​ చేసే ప్రయత్నం చేయగా శ్రీనివాస్​ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

దీంతో తండా వాసులంతా సమీపంలోని కొండాపూర్​సబ్​స్టేషన్​కు వద్ద ఆందోళనకు దిగారు. ఫీడర్ వద్ద ఎర్తింగ్ ప్రాబ్లమ్​తో   సమస్య తలెత్తినట్లు ట్రాన్స్​కో వర్గాలు తెలిపాయి.  సబ్​స్టేషన్​లో సప్లై​ నిలిపి వేసి సమస్యను క్లియర్​ చేశారు. గాయపడిన శ్రీనివాస్​ను జిల్లా హాస్పిటల్​కు తరలించారు.