అమెరికాలోని చమురు పైప్లైన్పై సైబర్ దాడి జరిగింది. దీంతో యూఎస్లోని కలోనియల్ పైప్లైన్ కంపెనీ మొత్తం నెట్వర్క్ ను మూసివేశారు. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్లైన్పై సైబర్ దాడి తర్వాత జో బైడెన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది.ఈ దాడి కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మాల్వేర్ను ప్రయోగించడం ద్వారా సంస్థ కంప్యూటర్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకుందని.. తాము కోరినంత డబ్బు ముట్టజెప్పాలని, లేనిపక్షంలో డాటాను ఇంటర్నెట్లో విడుదల చేస్తామని హ్యాకర్లు హెచ్చరికలు జారీ చేశారని తెలిపింది అమెరికా. సంస్థ యొక్క 100 జీబీ డాటాను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.
దీంతో పైప్లైన్ నెట్వర్క్ మూసివేశారు. ప్రతి రోజు 2.5 మిలియన్ బారెల్స్ ఇంధనం వలస రాజ్యాల పైప్లైన్ ద్వారా రవాణా జరుగుతుంది. ఈ పైప్లైన్ తూర్పు తీర శుద్ధి కర్మాగారాలను తూర్పు-దక్షిణ అమెరికాతో కలుపుతుంది. నాలుగు ప్రధాన లైన్లు నిలిచిపోయాయని కలోనియల్ కంపెనీ తెలిపింది. టెర్మినల్ నుంచి డెలివరీ పాయింట్ వరకు నడుస్తున్న కొన్ని చిన్న లైన్లు పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పింది.
