Alert: వామ్మో.. ఇలాగా కూడా మోసం చేయొచ్చా... సైబర్​ నేరగాళ్లు ఎంత డేంజరో..

Alert: వామ్మో.. ఇలాగా కూడా మోసం చేయొచ్చా... సైబర్​ నేరగాళ్లు ఎంత డేంజరో..
  • హోటల్​ రివ్యూలు రాయాలని టాస్క్​లు ఇచ్చి.. 

  • 2 లక్షలు లాగిన సైబర్​ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు:  ఆన్​లైన్​లో టాస్క్ ల పేరుతో   నగరానికి చెందిన ఓ  25 ఏండ్ల  స్టూడెంట్​ నుంచి సైబర్​ నేరగాళ్లు రూ. 2 లక్షలను లాగారు.   బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఏసీపీ శివ మారుతి తెలిపిన వివరాల ప్రకారం...    గూగుల్ లో హోటల్స్ , రిసార్ట్స్ కు రివ్యూస్ ఇవ్వాలని , ఒక్కో టాస్క్ కు రూ. 50  చెల్లిస్తామని  నేరగాళ్లు యువకునికి వాట్సాప్​లో మెసేజ్​ చేశారు.  అనంతరం   బ్యాంక్ వివరాలు సేకరించి , అతడి నెంబర్ ను  టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు. మొదటగా ప్రీపెయిడ్ టాస్క్ పేరుతో రూ. వెయ్యి  చెల్లించాలని  క్యూఆర్​ కోడ్​ను పంపారు. 

దీంతో యువకుడు  వెయ్యి పంపి,  మొదటి టాస్క్ పూర్తయిన  తర్వాత అతనికి డబ్బులను బదిలీ చేశారు. అలాగే మరో రెండు టాస్క్ లకు లాభాలు రావడంతో   చీటర్స్  సూచించిన  స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేయాలని , అధిక లాభాలు వస్తాయని  మరింత నమ్మించారు.  దీంతో అతను  దఫాలుగా రూ. 2లక్షల 19వేలను  ఇన్వెస్ట్ చేశాడు. కానీ  వేరే వాటిపై ఇన్వెస్ట్ చేయడంతో ఆ డబ్బులు ఫ్రీజ్​ అయ్యాయని ,  రిలీజ్ కావాలంటే ఇంకొంతమేర డబ్బులు చెల్లించాలని  చెప్పారు.  

తన డబ్బులు   తిరిగి చెల్లించాలని బాధితుడు ఒత్తిడి చేయగా , అతని నెంబర్  బ్లాక్ చేశారు.  మోసపోయాయని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.