కొంపు ముంచుతున్న నకిలీ ఏపీకే ఫైల్స్ ..బ్యాంకులు, బిల్లులు కట్టాలంటూ సైబర్ మోసాలు

 కొంపు ముంచుతున్న నకిలీ ఏపీకే  ఫైల్స్ ..బ్యాంకులు, బిల్లులు కట్టాలంటూ సైబర్ మోసాలు
  •  నకిలీ యాప్స్​తో ఫోన్​ను కంట్రోల్​లోకి తీసుకుంటున్న నేరగాళ్లు.. 
  • అనుమానం రాకుండా ఓటీపీలతోనూ ఫ్రాడ్​
  • ఆలోచించకుండా నొక్కితే అంతే సంగతి

కూకట్​ పల్లికి చెందిన రిటైర్డ్​ టీచర్​ సోమేశ్​ షాపింగ్​మాల్​లో బట్టలు కొన్నాడు. రెండు రోజుల తర్వాత అతడికి ఒక ఏపీకే ఫైల్​వచ్చింది. బట్టలు కొన్నందుకు గిఫ్ట్​ ఓచర్ వచ్చిందని, దాన్ని రిడీమ్​ చేసుకోవాలంటే తాము పంపిన ఏపీకే ఫైల్​ను డౌన్​లోడ్​చేసుకోవాలని సూచించారు. దీంతో వారు చెప్పినట్టు చేశాడు. కొద్దిసేపటికే అతడికి ఓ ఓటీపీ వచ్చింది. 

తర్వాత కొద్దిసేపటికి ఫోన్​స్ట్రక్​ అయినట్టు అనిపించింది. కాసేపటికి అంతా సెట్​అయిపోయింది. కానీ, అతడి బ్యాంక్​ అకౌంట్​ నుంచి పలు ఖాతాలకు డబ్బులు క్రెడిట్​ అయ్యాయని మెసేజ్​లు వచ్చాయి. దీంతో సైబర్​ క్రిమినల్స్​ తనను మోసం చేశారని తెలుసుకుని బ్యాంకుతో పాటు సైబర్​ పోలీసులను ఆశ్రయించాడు.  

హైదరాబాద్​ సిటీ, వెలుగు : రాష్ట్రంలో సైబర్​క్రిమినల్స్​ఏపీకే ఫైల్స్ పంపి జనాల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. ఏపీకే ఫైల్స్​తో వాట్సాప్ హ్యాక్​ చేసి దాని ద్వారా బ్యాంక్​ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గవర్నమెంట్​పథకాలు, బ్యాంక్​సర్వీస్, ఇన్వెస్టిమెంట్​ఛాన్స్​పేర్లతో మెసేజ్​లు పంపిస్తూ ఆకర్శిస్తున్నారు. ఆ పేర్లతో వచ్చిన ఏపీకే ఫైల్స్​ను డౌన్​లోడ్​ చేయించి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం సేకరించి డబ్బులు కాజేస్తున్నారు.  

మోసం చేస్తారిలా.. 

బ్యాంక్ అప్​డేట్స్ వచ్చాయని, ఉద్యోగాలున్నాయంటూ సైబర్​క్రిమినల్స్​ఫేక్​లింకులను ఎస్ఎంఎస్​, వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్ ద్వారా పంపుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆర్టీఓ చలాన్​, పీఎం కిసాన్​, ఎలక్ట్రిసిటీ బిల్​, వాటర్​బోర్డు బిల్లులు, క్రెడిట్​కార్డ్, రివార్డ్స్​పాయింట్ల పేరుతో ఏపీకే ఫైల్స్​పంపుతున్నారు. అవి ఇన్​స్టాల్​చేయగానే మన ఎస్ఎంఎస్​, కాంటాక్ట్స్, నోటిఫికేషన్, స్ర్కీన్​షేరింగ్​వంటి యాక్సెస్​ సైబర్​నేరగాళ్ల చేతికి వెళ్తోంది. మన ఫోన్​ను వారి ఆధీనంలోకి తీసుకుని బ్యాంక్ లాగిన్లు, ఓటీపీల సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని యాప్స్​తో మొబైల్​ను పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. 

ఇలా చేస్తే సమస్య ఉండదు.  

తెలియని ఏపీకే ఫైల్స్​ను ఎట్టి పరిస్థితుల్లో డౌన్​లోడ్​చేయవద్దు , ఎస్ఎంఎస్, వాట్సాప్​, టెలిగ్రామ్​, ఈమెయిల్​లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్​లను ఇన్​స్టాల్​చేయొద్దు. అధికారికంగా నిర్ధారించని లింకులను జాగ్రత్తగా పరిశీలించాలి. బ్యాంక్ అప్డేట్లు, క్యాష్​బ్యాక్​, కేవైసీ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయొద్దు. సైబర్​క్రిమినల్స్​ప్లే స్టోర్​నుంచి కాకుండా బయటి నుంచే ఏపీకేలను డౌన్​లోడ్​చేయమని చెప్తారు. 

ఇలా చెప్పినప్పుడు ఖచ్చితంగా అనుమానించాలి. అవసరం లేని పర్మిషన్లు ఇవ్వాలని చెప్పినప్పుడు అనుమానించాలి అంటే యాప్ ఇన్​స్టాల్​చేసేప్పుడు స్క్రీన్​షేరింగ్​వంటి అనుమతులు కోరినప్పుడు సందేహించాలి. మొబైల్, యాంటీవైరస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మాల్​వేర్​నుంచి రక్షణ పొందేందుకు ఎప్పటికప్పుడు మొబైల్ ఓఎస్​, సెక్యూరిటీ టూల్స్​అప్డేట్ చేయాలి. 

ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు ఓటీపీలు, పాస్​వర్డ్​లు అడగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.  సైబర్​క్రైమ్​జరిగిందని తెలిసినప్పడు 1930 నంబర్​కు కాల్​చేసి చెప్పడమో లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి.
  
ఓటీపీ మోసాలు ఇలా...

బ్యాంక్ పేరిట, కేవైసీ అప్డేట్ అంటూ కాల్స్​ చేస్తారు. బ్యాంక్ ఉద్యోగులం అని చెప్పి డెబిట్ కార్డ్,  క్రెడిట్ కార్డ్  ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పి ఓటీపీ చెప్పాలని కోరతారు.  ఇలా చెప్పడం వల్ల మన ఖాతాల్లోకి డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. ఆన్​లైన్​షాపింగ్​చేయడం వల్ల క్యాష్​బ్యాక్​వచ్చిందని, రీఫండ్, గిఫ్ట్ ఓచర్, లేదా పాయింట్లు వస్తాయని చెప్పి కాల్​చేస్తారు. 

ఈ సందర్భాల్లో కూడా ఓటీపీలు తీసుకుని డబ్బులు కొల్లగొడతారు. గూగుల్​లో ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ గురించి సెర్చ్​చేసినప్పుడు కొందరు సైబర్​క్రిమినల్స్​తెలివిగా తాము పెట్టిన నంబర్స్​ముందు వచ్చేలా చూస్తారు. ఈ నంబర్​కు కాల్​ చేసినప్పుడు మోసగాళ్లు కాల్స్​మాట్లాడతారు. 

వెరిఫికేషన్ కోసం ఓటీపీ అడిగి డబ్బులు కాజేస్తారు. గూగుల్​లోగాని,  సోషల్ మీడియాలో కనిపించే నంబర్లు కాకుండా అధికారిక వెబ్​సైట్స్​, యాప్స్​లో ఉన్న నంబర్లను ఉపయోగించడం వల్ల సమస్య  ఉండదు. తాము చెప్పినట్టు వింటే వెంటనే ఉద్యోగం లేదా లోన్ వస్తుందని ఓటీపీ అడుగుతారు. 

ఇలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ తెలుసుకుని మన పేరు మీదున్న సిమ్​కు డూప్లికేట్​తీసుకుంటారు. ఈ సిమ్​ను బ్యాంకింగ్ అవసరాలకు వాడుకుని మన డబ్బులను మాయం చేస్తారు.  లివరీ బాయ్, మార్కెట్​ఏజెంట్లుగా నమ్మించి మనం కొన్న వస్తువు రిటర్న్/రిఫండ్ కోసం ఓటీపీ చెప్పాలని కోరతారు.  

దీనివల్ల మన డబ్బులను పోగొట్టుకుంటాం. ఈ సమస్యలు రావొద్దనుకుంటే సాధ్యమైనంతవరకు మెసేజ్​స్క్రీన్​షాట్స్​ఎవరికీ పంపొద్దు ..ఎస్ఎంఎస్​లాక్, ఫోన్ స్క్రీన్​లాక్​​యాక్టివేట్​చేసుకోవాలి.  బ్యాంక్ ట్రాన్సాక్షన్​అలర్ట్​ను కూడా యాక్టివేట్ చేయండి.

ఇవీ వెబ్​సైట్స్​

https://www.facebook.com/cybercrimepshyd
https://www.instagram.com/cybercrimepshyd
https://x.com/CyberCrimeshyd/