అక్రమ లిక్కర్​ షాపులపై పోలీసులు దాడి.. 796 లీటర్ల మద్యం స్వాధీనం

అక్రమ లిక్కర్​ షాపులపై పోలీసులు దాడి.. 796 లీటర్ల మద్యం స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై  ఎస్​ఓటీ (SOT) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేపట్టారు. 8 పీఎస్‌ల పరిధిల్లో రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా నిర్వహిస్తున్న ఎనిమిది మద్యం షాపులపై పోలీసులు దాడి చేశారు.  లైసెన్స్​ లేకుండా అధిక ధరలకు లిక్కర్​ అమ్ముతున్నారు.  లైసెన్స్​ ఉన్న షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.  షాపులపై కేసులు నమోదు చేశారు. 

ALSO READ :- Good Health : పని ఒత్తిడి నుంచి ఇలా రిలాక్స్ అవ్వండి.. ఉత్సాహం ఉరకలేస్తుంది..!