పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్​ యాత్ర

పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్​ యాత్ర

నిజామాబాద్​సిటీ/ కామారెడ్డి టౌన్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒకరూ కృషి చేయాలని దేశవ్యాప్త సైకిల్​ యాత్ర చేపట్టిన రాబిన్​సింగ్​ పేర్కొన్నారు. గ్రీన్​ ఇండియా మూమెంట్​లో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఈటర జిల్లా శక్కర్​నగర్​ తాలుకాకు చెందిన రాబిన్​సింగ్ ​సైకిల్​యాత్ర చేపట్టారు. యూపీ నుంచి షురూ అయిన యాత్ర గురువారం కామారెడ్డి, నిజామాబాద్​లకు చేరింది.

కామారెడ్డిలో ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్​వద్ద రాబిన్​సింగ్​ను కామారెడ్డి డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్​ కలిశారు. ఇప్పటి వరకు తాను 2,700 కిలమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు రాబిన్​ తెలిపారు.