V6 News

వెయ్యి కోట్ల పెట్టుబడితో..చిత్తూరు శ్రీసిటీలో ఆర్ అండ్ డీ సెంటర్

 వెయ్యి కోట్ల పెట్టుబడితో..చిత్తూరు  శ్రీసిటీలో ఆర్ అండ్ డీ సెంటర్
  • ఢిల్లీ సమీపంలోనూ మరొకటి
  •  రూ.1,000 కోట్ల పెట్టుబడి
  • డైకిన్​ డైరెక్టర్​ సంజయ్​ గోయల్​

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్​ నగరం చిత్తూరు శ్రీసిటీలోని తమ ప్లాంటులో ఆర్​ అండ్ ​డీ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని ఏసీల తయారీ కంపెనీ డైకిన్​ డైరెక్టర్​, సీనియర్​ వైస్​-ప్రెసిడెంట్​ సంజయ్​ గోయల్​ చెప్పారు. హైదరాబాద్​లో గురువారం తన డీలర్​ శ్రీకంఫర్ట్స్​ సర్వీస్​ సెంటర్​ను ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ- సమీపంలో రూ.1000 కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.  

‘‘ముడి సరుకుల ధరలు పెరగడం, కొత్త ఎలక్ట్రిసిటీ రేటింగ్స్​ వల్ల ఏసీల ధరలను ఈ నెలలోనే ఏడు శాతం వరకు పెంచాం.  2026 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. దక్షిణ భారతదేశం నుంచి కంపెనీకి 25 శాతం కంటే ఎక్కువ ఆదాయం లభిస్తోంది”అని ఆయన వివరించారు.  కంపెనీ రీజనల్ ​ప్రెసిడెంట్​ కుటుంబ రావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఏడు డైకిన్ సొల్యూషన్ ప్లాజాలు ఉన్నాయని, వీటిని ఈ ఏడాది 50 శాతం మేర పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.