
చిత్రకూట్: గురుదక్షిణగా తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని జగద్గురు రాంభద్రాచార్యులు కోరారు. బుధవారం జనరల్ ద్వివేదీ చిత్రకూట్ లోని రాంభద్రాచార్య ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ద్వివేదీకి రాంభద్రాచార్యులు రామ మంత్రంతో దీక్ష ఇచ్చారు. ‘‘మాతా సీత హనుమంతుడికి ఇచ్చిన రామ మంత్ర దీక్షను ద్వివేదీకి ఇచ్చాను. ఈ దీక్షతో హనుమంతుడు లంకను జయించాడు. అలాగే, నేను గురుదక్షిణగా పీవోకేను కోరాను’’ అని అన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.