గురుదక్షిణగా పీవోకే కావాలి.. ఆర్మీ చీఫ్​ ను కోరిన రాంభద్రాచార్య

గురుదక్షిణగా పీవోకే కావాలి..   ఆర్మీ చీఫ్​ ను కోరిన రాంభద్రాచార్య

చిత్రకూట్: గురుదక్షిణగా తనకు పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ కావాలని ఆర్మీ చీఫ్ ​జనరల్ ఉపేంద్ర ద్వివేదీని జగద్గురు రాంభద్రాచార్యులు కోరారు. బుధవారం జనరల్ ద్వివేదీ చిత్రకూట్ లోని రాంభద్రాచార్య ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ద్వివేదీకి రాంభద్రాచార్యులు రామ మంత్రంతో దీక్ష ఇచ్చారు. ‘‘మాతా సీత హనుమంతుడికి ఇచ్చిన రామ మంత్ర దీక్షను ద్వివేదీకి ఇచ్చాను. ఈ దీక్షతో హనుమంతుడు లంకను జయించాడు. అలాగే, నేను గురుదక్షిణగా  పీవోకేను కోరాను’’ అని అన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయింది.