దళితబంధు కోసం రోడ్డుపై బైఠాయించిన దళితులు.. భారీ ట్రాఫిక్ జామ్

 దళితబంధు కోసం రోడ్డుపై బైఠాయించిన దళితులు.. భారీ ట్రాఫిక్ జామ్

ఖమ్మం జిల్లాలో దళితులు రోడ్డెక్కారు..అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వకుండా బీఆర్ ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారని రోడ్డు పై బైఠాయిం చి ధర్నా చేశారు.రఘునాథపాలెం, బూదిడెంపాడులో అంబేద్కర్ జెండాలతో రోడ్డుపై బైఠాయించారు దళితులు.

Also Read :- 17 వేల 676 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ

దీంతో ఖమ్మం, ఇల్లందు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అర్హులైన దళితులందరికి వెంటనే దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.