భూపాలపల్లి సభ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాం

భూపాలపల్లి సభ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాం

హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇవాళ(మంగళవారం) విడుదలైంది. అయితే ఇప్పటికే ఎన్నికల బరిలో దింపే అభ్యర్థులపై అధికార  TRS తో పాటు BJP స్పష్టతతో ఉంది. TRS అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్,BJP అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. దీనిపై పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ స్పందించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజనర్సింహ తెలిపారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్టు తెలిపారు. అంతేకాదు.. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చామని, ఈ నెల 30న నిర్వహించనున్న భూపాలపల్లి సభ తర్వాత హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.