ఖైరతాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫొటోలతో కార్పొరేటర్ వనం సంగీత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇండియా మ్యాప్ను తప్పుగా ప్రింట్ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సోమాజిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తోన్న ఇండియా మ్యాప్ లో జమ్ము, కశ్మీర్, గోవా రాష్ట్రాలు లేవు.
సోమవారం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కావాలనే అలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా ? లేక మరేదైనా కారణముందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇటీవల జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ముందుగా టీఆర్ఎస్ నేతలు ఇండియా మ్యాప్, చరిత్రపై అవగాహన తెచ్చుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.