కష్టపడి పనిచేసే వారికేకాంగ్రెస్లో పదవులు

కష్టపడి పనిచేసే వారికేకాంగ్రెస్లో పదవులు
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్య

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికే పదవులు దక్కుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో రూ.60 లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 150 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

 ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని, కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయాలను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.