దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరణ్​పూర్​ పోలీస్​స్టేషన్​పరిధిలోని నహాడీ, చోటే హిడ్మా, డూంగినీ పారా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

బస్తర్​ఫైటర్లు, డీఆర్​జీ బృందాలు సంయుక్తంగా బుధవారం ఉదయాన్నే కూంబింగ్ చేపట్టారు. నహాడీ సీఆర్​పీఎఫ్ క్యాంపునకు 4 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపైఒకరు ఫైరింగ్​స్టార్ట్​చేయగా, ఉదయం 7.15 నుంచి దాదాపు రెండు గంటల పాటు భీకరంగా కాల్పులు కొనసాగాయి. 

తర్వాత మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. పోలీస్​బలగాల ఎన్​కౌంటర్​లో లక్కే, మంగ్లీ అనే ఇద్దరు మహిళా మావోయిస్టులు హతయ్యారు. ఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలతోపాటు 12 బోర్​గన్, ఇన్సాస్​రైఫిల్, బుల్లెట్లు దొరికాయి. మృతదేహాలను దంతేవాడకు తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో గాలింపు ముమ్మరం చేశారు.