
మహబూబ్ నగర్ లో భూసేకరణ పేరుతో వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకోవడానికి కేసీఆర్ ఎవరని నిలదీశారు. బడా బాబుల కోసమే పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కోర్టులు ఒకలా తీర్పు చెప్తే.. సీఎస్ సోమేశ్ కుమార్ మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పేదలకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని దాసోజు శ్రవణ్ అన్నారు.
మరిన్ని వార్తల కోసం..