- పిరికితనంతో ర్యాలీకిఅనుమతి రద్దు: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తున్నదని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి ఆరోపించారు. శనివారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతియుత ర్యాలీకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులను మోహరించి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఎవరూ సహించబోరని ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ సంస్కృతి, అస్థిత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని, కానీ, రేవంత్ రెడ్డి పిరికితనంతో ర్యాలీకి అనుమతి రద్దు చేశారని దాసోజు శ్రవణ్ అన్నారు. బెదిరింపుల పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదని పేర్కొన్నారు. మల్కాజిగిరి నుంచి గతంలో ఎంపీగా గెలిచినందుకే.. దానిని రేవంత్ కార్పొరేషన్గా చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు.
