నిరుద్యోగులరా ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావు

నిరుద్యోగులరా ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావు

పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్. నిరుద్యోగులరా ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావు..ప్రాణాలతో ఉండి కేసీఆర్ పై పోరాడి సాధించుకుందామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదంటూ తీవ్రమానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు యత్నించి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నాయక్ ను పరామర్శించారు దాసోజు శ్రవణ్.
 
బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు ఎన్నో కలలు కన్న వారి ఆశలపై కేసీఆర్  ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రవణ్. గత ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ కుటుంబాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందన్నారు. కేసీఆర్,కేటీఆర్ లకు నిరుద్యోగుల శాపం తగులుతుందన్నారు. సునీల్ కు జరగరానిది జరిగితే ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు మండలాలు ఏర్పడ్డా.. కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉన్నా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. 50 వేల ఉద్యోగాల ప్రకటన మోసపూరితమైందని..TSPSC ద్వారానే భర్తీ చేయాల్సి ఉండగా ప్రత్యామ్నాయాల ద్వారా నియామకాలు చేపడతామనడం మోసపూరితమైన ప్రకటనలేనన్నారు దాసోజు శ్రవణ్.