కేసీఆర్ మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకోం: దాసోజు శ్రవణ్‌‌

కేసీఆర్ మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకోం: దాసోజు శ్రవణ్‌‌

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి పట్టినట్లు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్ మీద బట్ట కాల్చి మీద వేస్తే, కర్రు కాల్చి వాత పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని హుందాతనంగా నిర్వహించడం లేదని విమర్శించారు. నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారన్నారు. సిగ్గు శరం లేకుండా మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా, నిర్లక్ష్యం చేసి పంట పొలాలను ఎండబెట్టిన ఘనత రేవంత్‌‌కే చెందుతుందన్నారు. ప్రజలపై ఆయనకు ఎలాంటి ప్రేమ లేదని ఫైర్‌‌‌‌ అయ్యారు.