ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. 31వ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌‌‌‌

ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. 31వ సినిమాకి ముహూర్తం ఫిక్స్‌‌‌‌

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  మూవీ ఓపెనింగ్‌‌‌‌కు సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్టు సమాచారం.  ఆగస్టులో సినిమా మొదలవబోతున్నట్టు గతంలోనే ప్రకటించిన మేకర్స్.. అందుకు తగ్గట్టే ఈనెల 9న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 31వ సినిమా.  ‘డ్రాగన్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ ప్రచారంలో ఉంది.

ఇక ప్రస్తుతం దేవర, వార్‌‌‌‌‌‌‌‌ 2 చిత్రాల షూటింగ్స్‌‌‌‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.  ‘దేవర ఫస్ట్ పార్ట్‌‌‌‌ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.  ఈ రెండు చిత్రాల షూట్ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌‌‌‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు ప్రశాంత్‌‌‌‌ నీల్..  ప్రభాస్‌‌‌‌తో ‘సలార్‌‌‌‌‌‌‌‌ 2’ తెరకెక్కించాల్సి ఉంది. మరి ఎన్టీఆర్, ప్రభాస్‌‌‌‌ చిత్రాల్లో దేన్ని ముందుగా సెట్స్‌‌‌‌కు తీసుకెళతాడో అనే ఆసక్తి నెలకొంది.