భర్తపై కోపంతో అత్తింటికే కన్నం వేసింది ఓ కోడలు. కుటుంబ సభ్యులతో కలిసి అత్తింట్లో దొంగతనానికి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ తో అత్తింట్లో భారీ చోరీకీ పాల్పడింది. ఈ ఘటన హైదరాబాదద్ లోని బోయిన్ పల్లిలో జరిగింది.
హైదరాబాద్ సిపి అంజనికుమార్ వివరాల ప్రకారం.. బోయిన్ పల్లిలో ధీరజ్ అనే వ్యక్తితో సుప్రీయకు పెళ్లైంది. పెళ్లైన నుంచి సుప్రీయ భర్తకు దూరంగా ఉంటుంది. దీంతో భర్తపై వాళ్ల కుటుంబంపై కోపం పెంచుకున్న సుప్రీయ.. వడ్డీ వ్యాపారి అయిన తన అత్తింట్లో కుటుంబ సభ్యులతో కలిసి భారీ చోరీకీ స్కెచ్ వేసింది. ఇంటి తాళాలు డమ్మీవి చేయించిన సుప్రీయ ఆమె అన్న తల్లిదండ్రులతో కలిసి అత్తింట్లో 3 కేజీల గోల్డ్, వెండీ, 18 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
సీసీ టీవీ ఫుటేజీ సహాయంతో దొంగలను గుర్తించారు పోలీసులు. చోరీకి పాల్పడింది సుప్రీయ ఆమె కుటుంబ సభ్యులు సాత్విక్, శ్రీనివాస్, సునీతలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కేజీల బంగారం, రెండున్నర కేజీల వెండీనీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.