కొత్త న్యాయచట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీసీపీ కోటేశ్వర రావు

కొత్త న్యాయచట్టాలపై అవగాహన పెంచుకోవాలి : డీసీపీ కోటేశ్వర రావు
  •    డీసీపీ కోటేశ్వర రావు 

నిజామాబాద్ క్రైమ్, వెలుగు :  కొత్త నేర న్యాయ చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,  భారతీయ సాక్ష్య అధినియమ్)పై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని డీసీపీ కోటేశ్వరరావు సూచించారు. నిజామాబాద్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హల్​లో కొత్త చట్టాలపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన విధానాల మీద సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్. శ్రీనివాస్ రావు, సీసీఆర్​బీ సీఐ శ్రీనివాస్ రాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ కోర్టు కానిస్టేబుల్స్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.