కాంపౌండ్ ​లో దహనం గోడవతల ఎముకలు

కాంపౌండ్ ​లో దహనం గోడవతల ఎముకలు

మెదడువాపు వ్యాధితో (అక్యూట్​ఎన్​సెఫాలిటిస్ ​సిండ్రోమ్ ఏఈఎస్)తో బీహార్‌లో 146 మంది చిన్నారులు మరణించారు. అందులో ఎక్కువ శాతం ముజఫర్​పూర్​లోని శ్రీకృష్ణా మెడికల్​ కాలేజ్​ అండ్ ​హాస్పిటల్​లోనే చనిపోయారు. ఓవైపు చిన్నారులకు అందించిన ట్రీట్​మెంట్​పై విమర్శలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు చిన్నారుల మృతదేహాల పట్ల హాస్పిటల్​సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పోస్ట్​మార్టం జరిపాక డెడ్​బాడీలను ఆస్పత్రి సిబ్బంది కాంపౌండ్​లోపల దహనం చేశారు. ఆపై ఎముకలను గోడవతల పారేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం శనివారం బయటకు పొక్కడంతో ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 108 చిన్నారుల మృతదేహాలను ఇలాగే దహనం చేసినట్లు సమాచారం. దీనిపై ఎస్​కేఎంసీహెచ్​మెడికల్​ సూపరింటెండెంట్​ ఎస్​కె షాహి మాట్లాడుతూ.. మృతదేహాల విషయంలో మానవత్వంతో వ్యవహరించి ఉండాల్సిందని అంగీకరించారు. పోస్ట్​మార్టం పూర్తయ్యాక, క్లెయిం చేయని శవాలను అక్కడి సిబ్బందే ఖననం చేస్తారని చెప్పారు. చిన్నారుల మృతదేహాల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన తీరుపై ప్రిన్సిపాల్​తో మాట్లాడతానని, దీనికి బాధ్యులను గుర్తించేందుకు అంతర్గత విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. మీడియాలో వార్తల నేపథ్యంలో కలెక్టర్​స్పందించారు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రిపోర్టివ్వాలని అధికారులను ఆదేశించారు.

బతికినా భారమే..

మెదడువాపు బారినపడ్డ పిల్లలు కోలుకున్నా భవిష్యత్​భారంగానే మారనుందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి ప్రభావంవల్ల వారు సాధారణ జీవితం గడపడం సాధ్యంకాదన్నారు. ముజఫర్​పూర్ జిల్లాలోని గంగాపూర్​గ్రామానికి చెందిన మునా దేవీ మనవడు రెండేళ్ల క్రితం ఏఈఎస్​బారిన పడి కోలుకున్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో దక్కాడని మునా దేవీ సంతోషించారు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలుడి ఆరోగ్యంలో తేడా బయటపడింది. మానసిక, శారీరక ఎదుగుదలపై ఏఈఎస్​ప్రభావం ఇప్పటికీ పోలేదని డాక్టర్లు గుర్తించారు. ఏఈఎస్​కేసుల్లో 97 శాతం కేసులు ఐదు జిల్లాల్లో(ఈస్ట్​చంపారన్, సీతామర్హి, ముజఫర్ పూర్, సమస్థిపూర్, వైశాలి)లోనే నమోదయ్యాయి.

జిల్లాల వారీగా..

జనవరి 3 నుంచి జూన్​19, 2019.. ఔరంగాబాద్, బెగుసరాయ్, భోజ్​పూర్, దర్భంగా, గయ, నలంద, సుపౌల్.. ఏడు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు. జెహనాబాద్​లో 2, వెస్ట్​చంపారన్​లో 3, పాట్నా 4, ఈస్ట్​చంపారన్​లో 65, షెహర్​14, సీతామర్హి 25, సమస్థిపూర్​18, వైశాలి 65 కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 611.