నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 నెలల గ్రూప్–1,2,3,4, బ్యాంకింగ్, ఆర్ఆర్ బీ, ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోచింగ్ కు దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు అర్హులన్నారు.
అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 1న, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికైన వారికి 5 నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్, భోజన వసతి కల్పించి, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 89773 40006 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.
