కాల్పుల విరమణ ప్రకటించండి: రష్యా-ఉక్రెయిన్లకు భారత్ విజ్ఘప్తి

కాల్పుల విరమణ ప్రకటించండి: రష్యా-ఉక్రెయిన్లకు భారత్ విజ్ఘప్తి

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ ప్రకటించాలని ఉక్రెయిన్, రష్యాలను భారత్ కోరింది. ఉక్రెయిన్ లో చిక్కుకుని స్వదేశానికి వచ్చేందుకు భారతీయులందరూ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం 9వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. వారిలో భయాన్ని తొలగించి క్షేమంగా తిరిగొస్తామనే నమ్మకాన్ని కలిగించేందుకు భారత విదేశాంగశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యా, ఉక్రెయిన్ దేశాలను కోరారు.