దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఐదు రోజులుగా వైరస్ భాధితుల సంఖ్య మూడు లక్షల లోపు నమోదు అవుతోంది. ఇదే టైంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 2 లక్షల 59 వేల 591 మందికి వైరస్ సోకింది. కొత్తగా 3 లక్షల 57 వేల 295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కరోనా మరణాలు మాత్రం తగ్గటం లేదు. 24 గంటల్లో 4 వేల 209 మంది వైరస్ తో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల 91 వేల 331 మంది మృతి చెందారు. 30 లక్షల 27 వేల 925 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అటు ఇప్పటి వరకు 19 కోట్ల 18 లక్షల 79 వేల 503 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.