కాంగ్రెస్ తోనే బహుజనులకు న్యాయం : దీపాదాస్ మున్షీ

కాంగ్రెస్ తోనే  బహుజనులకు న్యాయం : దీపాదాస్ మున్షీ

ముషీరాబాద్,వెలుగు: బహుజనులకు కాంగ్రెస్ న్యాయం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. సోమవారం గాంధీభవన్ లో పార్టీ సీనియర్ నేత రోహిన్ రెడ్డి నేతృత్వంలో ముషీరాబాద్ బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పోచగారి నరేందర్ తన అనుచరులతో దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

  అనంతరం నరేందర్ మాట్లాడుతూ దేశంలో.. రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర మహిళా కన్వీనర్ శైలజ, బండారి శ్రీనివాస్, రజిత, పరమేశ్వర్, రహీం, విశ్వనాథ్, నరసింహ, దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డి, రవి, క్రాంతి కుమార్, అజయ్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.